News December 15, 2025
కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రామలక్ష్మణపల్లి 9.6°C, గాంధారి 9.9, మేనూర్ 10.1, పెద్ద కొడప్గల్ 10.2, డోంగ్లి, లచ్చపేట, దోమకొండ 10.4, బిచ్కుంద, జుక్కల్ 10.5, తాడ్వాయి 10.6, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి, నాగిరెడ్డిపేట, ఎల్పుగొండ 10.7, మాచాపూర్, సర్వాపూర్ 10.8°Cలుగా నమోదయ్యాయి.
Similar News
News April 10, 2026
కడప: యువతి గొంతు కోసి హత్య

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News April 10, 2026
గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్..!

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
భద్రాద్రి: తీరని కష్టాలు.. అర్ధరాత్రి డోలీలో గర్భిణి తరలింపు

రహదారి సౌకర్యం లేక గర్భిణులు పడుతున్న కష్టాలకు బూర్గంపాడు మండలం చింతకుంట నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం రాత్రి మడవి సావిత్రి అనే 7 నెలల గర్భిణికి తీవ్ర అస్వస్థత కలగగా, అంబులెన్స్ వచ్చే వీలులేక గ్రామస్థులు ఆమెను డోలీలో 2 కిలోమీటర్లు మోసుకెళ్లారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.


