News December 15, 2025
GWL: నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా, ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కావొద్దని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 11, 2026
గుమ్మానికి ఎదురుగా మరో గుమ్మం ఉండవచ్చా?

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో గుమ్మం ఉండటం శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇలా ఉంటే గదులు, హాల్స్ను క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘దీనివల్ల ఇంటి లోపల శక్తి ప్రసరణ సాఫీగా జరిగి, కుటుంబీకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇల్లు చూసేందుకు అందంగా, అమరికగా కనిపిస్తుంది. ఈ నియమాన్ని పాటిస్తే గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 11, 2026
మేడారంలో నో సిగ్నల్స్.. భక్తుల అసహనం

మేడారం మహా జాతరలో సిగ్నల్స్ లేక అవస్థలు తప్పడం లేదు. జాతర మొదలుకాక ముందే సిగ్నల్ అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొబైల్ సిగ్నల్పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫోన్లు కలవకపోవడం లేదని, ఇంటర్నెట్ పనిచేయడం లేదని వాపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతర ఉండగా ఇప్పుడే సిగ్నల్ కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
News January 11, 2026
BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.


