News December 15, 2025
గోదావరిఖని: DEC 23న అరుణాచలానికి స్పెషల్ బస్సు

GDK నుంచి అరుణాచలానికి 7రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్ర GDK బస్టాండు నుంచి DEC 23న ప్రారంభమై తిరిగి 29న చేరుకుంటుంది. యాత్రలో కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశేంబు, మధురై, రామేశ్వరం, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబ దర్శనాలు చేసుకోవచ్చుని, ఒక్కరికి ఛార్జీ రూ.8000గా ఉంటుందని DM నాగభూషణం తెలిపారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులవే ఉంటాయని, టికెట్ల రిజర్వేషన్ కోసమ 7013504982ను సంప్రదించవచ్చు.
Similar News
News January 12, 2026
ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News January 12, 2026
అగ్నివీర్ వాయు దరఖాస్తులు షురూ

ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయు నియామకాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా నాలుగేళ్లపాటు ఎయిర్ఫోర్స్లో సేవలందించేందుకు యువతకు అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 1వ తేదీ 11PM వరకు అప్లై చేసుకునేందుకు గడువుంది. 2006 జనవరి 1-2009 జులై 1 మధ్య పుట్టిన, ఇంటర్/12వ తరగతిలో 50% మార్కులు సాధించిన అవివాహితులు అర్హులు. మరిన్ని వివరాలకు iafrecruitment.edcil.co.in.లో సంప్రదించవచ్చు.
News January 12, 2026
జనగామ: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన అంశాలపై రివ్యూ నిర్వహించారు.


