News April 20, 2024
బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి

సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వార్ సర్వేశ్ కుమార్ మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లు యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరి తెలిపారు.
Similar News
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
News February 8, 2026
కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.
News February 8, 2026
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు!

టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)పై ₹3.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అత్యధికంగా కర్వ్పై ₹3.80 లక్షలు-₹3.30 లక్షల దాకా తగ్గించింది. హారియర్-₹1.5 లక్షలు, పంచ్-₹1.6 లక్షలు, టియాగో-₹1.5 లక్షలు, నెక్సాన్పై ₹1.2 లక్షలు డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్ వేరియంట్స్ను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.


