News April 20, 2024
మార్కాపురం: మరో జంట ఆత్మహత్య

మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో మరో ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతులు నారు వెంకట నాగేశ్వరి, జక్కుల గోపిగా స్థానికులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం యువతికి మరొకరితో వివాహం జరుగనుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గోపి అదే గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News March 21, 2026
BREAKING: మార్కాపురం జిల్లాలో MRO సస్పెండ్

మార్కాపురం జిల్లా పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు VOR విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 25కి పైగా మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 21, 2026
మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.
News March 20, 2026
ప్రకాశం జిల్లాలో పెట్రోల్ ధరల పెంపు

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పవర్ పెట్రోల్ ధరల పెంపుతో మరో షాక్ తగిలింది. గిద్దలూరులోని అన్ని బంకుల్లో పెట్రోల్ లీటర్పై రూ.2.35 పెంచి రూ.119.59 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.


