News December 15, 2025

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్ భేటీ

image

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.

Similar News

News March 7, 2026

భీకర దాడి.. 47 మంది మృతి

image

ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇవాళ ష్ముస్టార్, నబీ చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్‌స్టైక్స్‌లో 47 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపింది. మరో 40 మంది గాయపడినట్లు పేర్కొంది. కాగా 2023 OCT నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4వేల మందికి పైగా మరణించగా, దాదాపు 17వేల మంది గాయపడినట్లు సమాచారం.

News March 7, 2026

‘కొండ మీది కోతి’నీ తెచ్చి ఇస్తారేమో!

image

ఎన్నికల హామీలు చూస్తుంటే త్వరలో ఎవరో ఒకరు కొండ మీది కోతినీ తెచ్చిస్తామంటారని జోకులు పేలుతున్నాయి. ఇవాళ <<19323424>>TVK విజయ్<<>> కురిపించిన హామీలతో ఈ ప్రస్తావన తెరపైకి వచ్చింది. సాధ్యమేనా? అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఇస్తున్న హామీల భారం ట్యాక్సుల రూపేనా ప్రజలపైనే పడుతుందని రాజకీయవేత్తలు అంటున్నారు. ఉచితాలతో రాష్ట్రాల ప్రగతి మందగిస్తుందని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పిన మాటలూ గుర్తుచేస్తున్నారు.

News March 7, 2026

‘మీ పని చూసుకోండి’.. ట్రంప్‌పై కమల్ హాసన్ ఫైర్

image

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్‌కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.