News December 15, 2025
అనకాపల్లి: జిల్లా పోలీస్ కార్యాలయానికి 50 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కారి వేదిక కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ తగాదాలు-34, కుటుంబ కలహాలు-2, మోసపూరిత వ్యవహారాలు-3, ఇతర విభాగాలకు చెందినవి-11 ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
పెట్టుబడుల డెస్టినేషన్గా ఏపీ: చంద్రబాబు

AP: దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25శాతం రాష్ట్రానికే వచ్చాయని మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ల డెస్టినేషన్గా మారిందన్నారు. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారం అయితే 16లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
News January 12, 2026
హార్సిలీహిల్స్లో లోయలో పడిన యువకుడు

హార్సిలీహిల్స్లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. పలమనేరుకు చెందిన పురుషోత్తం తిరుపతి SVUలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి హార్సిలీహిల్స్కు వచ్చాడు. గాలిబండ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడిపోయాడు. దట్టమైన పొగ మంచు కారణంగా చాలాసేపటి తర్వాత చెట్ల మధ్యలో అతడిని గుర్తించారు. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
News January 12, 2026
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.


