News April 20, 2024
పిడుగుపాటుకు 3 ఎద్దులు మృతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బాషా అనే రైతుకు చెందిన రెండు ఎద్దులను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కలుగొట్ల గ్రామంలో సైతం ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది.
Similar News
News October 10, 2025
పోలీస్ పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం: ఎస్పీ

కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల భద్రత రక్షణలో భాగంగా ప్రధాన రహదారుల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ప్రధాని సభ వద్ద బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేరాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News October 9, 2025
కర్నూలు జిల్లా నూతన జేసీగా నూరుల్

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూరుల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్ పర్సన్గా నియమించింది.
News October 8, 2025
నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.