News December 15, 2025
కాకాణి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 4, 2026
మనుబోలులో విజిలెన్స్ దాడులు.. రూ.కోటి సరుకు స్వాధీనం

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్ను డీజిల్గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.
News February 3, 2026
తిరుపతిలో మెహన్ బాబు, విష్ణుపై కేసులు

తిరుపతిలో విద్యార్థి సంఘాల <<19040348>>కిడ్నాప్<<>> వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీశ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిపై తిరుచానూరు PSలో కేసు నమోదు అయింది.
News February 3, 2026
BREAKING.. కాకాణికి నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.


