News December 15, 2025

బాపట్ల: ఎండుమిర్చి దొంగతనం కేసులో నిందితుడికి జైలు

image

అద్దంకి మండలం రాళ్లపాడుకు చెందిన శ్రీనివాసరావు పొలంలో 2025లో 10 క్వింటాళ్ల ఎండుమిర్చి దొంగలించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించారు. ఒంగోలులోని పేర్నమిట్టకు చెందిన చిరుతోటి మధు(41)కు సోమవారం అద్దంకి జడ్జి అఖిల 6నెలల జైలు శిక్ష విధించినట్లు అద్దంకి C.I సుబ్బరాజు తెలిపారు. దొంగతనం ఘటనపై అప్పటి SI కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తులో నిందితుడు ఉపయోగించిన ఆటోను కోర్టుకు స్వాధీనం చేశామన్నారు.

Similar News

News January 5, 2026

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి 85 ఫిర్యాదులు

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ప్రజల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సంబంధిత ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

అనకాపల్లి: ప్రజా ఫిర్యాదుల వేదికలో 47అర్జీలు

image

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS)లో మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలు 22, కుటుంబ కలహాలు 3, మోసపూరిత కేసులు 2, ఇతర విభాగాలవి 20 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా 7 రోజుల్లో పరిష్కరించాలని ఆయన అధికారులు ఆదేశించారు.

News January 5, 2026

సంగారెడ్డి: మైనార్టీ మహిళలకు కొత్త పథకాలు

image

మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ‘రేవంత్ అన్నా కా సహారా – మిస్కీన్ కేలియే’, ‘ఇందిరమ్మ మైనార్టీ’ అనే రెండు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని సంగారెడ్డి జిల్లా మైనార్టీ అధికారి విశాలాక్షి తెలిపారు. ఈ పథకాలకు అర్హులైన వారు ఈనెల 10లోగా <>ఆన్‌లైన్‌<<>>లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలని, మైనార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.