News December 15, 2025
కర్నూలు జిల్లా క్రీడాకారులను అభినందించిన నారా లోకేశ్

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్లో పాల్గొంటున్న జిల్లా స్విమ్మర్స్ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్లో క్రీడాకారులు హేమలత, శృతి, సిరి చేతన రాజ్, లహరిలు కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
Similar News
News January 15, 2026
కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.
News January 15, 2026
‘ఆదోనికి మీరే దిక్కు సీఎం చంద్రబాబూ..’

ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన దీక్ష ఇవాళ 60వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంతేకుడ్లూరు గ్రామ యువతతో పాటు జేఏసీ నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు దిక్కు అంటూ కళాకారుడు జగదీశ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్, షకీల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
News January 15, 2026
‘ఆదోని వైసీపీ కౌన్సిలర్లకు తగిన గుణపాఠం చెప్పాలి’

ఆదోని పట్టణ అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు అంటగట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడతారని టీడీపీ మాజీ కౌన్సిలర్ మారుతి, టీడీపీ నాయకుడు మల్లికార్జున బుధవారం అదోనిలో తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదోని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ బడ్జెట్ను ఆమోదించకుండా అడ్డుకోవడం తగదన్నారు.


