News December 16, 2025

VJA: విద్యుత్ బస్సులపై సీఎంతో భేటీ.. వర్కౌట్ అయ్యేనా.?

image

రాష్ట్రానికి DEC నాటికి రావాల్సిన 750 ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కేంద్ర నిధులు అందలేదు. ప్రైవేట్ సంస్థ కొనుగోలుకు సిద్ధమైనా, ఛార్జింగ్ స్టేషన్లు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల అవసరం ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత AC బస్సుల స్థానంలో వీటిని తేవాలనే కేంద్రం సూచనల మేరకు RTC ఉన్నత అధికారులు నేడు CMతో సమావేశం కానున్నారు. ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చే అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 7, 2026

ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

image

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 7, 2026

అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 7, 2026

విశాఖ: భర్త మిస్సింగ్.. భార్యే చంపేసిందా?

image

బక్కన్నపాలెం కే2 కాలనీలో అల్లాడ నాగరాజు అదృశ్యం కేసు మిస్టరీ కలకలం రేపుతోంది. గత నవంబర్‌లో భర్త నాగరాజు మిస్ అవగా DEC 9న భార్య రమ్య పీఎంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నగలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే విచారణలో రమ్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. హత్యాకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.