News December 16, 2025

VJA: విద్యుత్ బస్సులపై సీఎంతో భేటీ.. వర్కౌట్ అయ్యేనా.?

image

రాష్ట్రానికి DEC నాటికి రావాల్సిన 750 ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కేంద్ర నిధులు అందలేదు. ప్రైవేట్ సంస్థ కొనుగోలుకు సిద్ధమైనా, ఛార్జింగ్ స్టేషన్లు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల అవసరం ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత AC బస్సుల స్థానంలో వీటిని తేవాలనే కేంద్రం సూచనల మేరకు RTC ఉన్నత అధికారులు నేడు CMతో సమావేశం కానున్నారు. ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చే అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 8, 2026

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

image

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.

News January 8, 2026

శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

image

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.

News January 8, 2026

ధనుర్మాసం: ఇరవై నాలుగో రోజు కీర్తన

image

ఈ పాశురం కృష్ణుని గాథలు, గుణాన్ని కొనియాడుతోంది. రావణుని గెలిచిన రాముడికి, కృష్ణుడికి గోపికలు మంగళాశాసనాలు పలుకుతున్నారు. ‘గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ కరుణకు, శత్రువులను చెండాడు నీ సుదర్శన చక్రానికి జయం కలుగుగాక’ అని కీర్తిస్తున్నారు. ‘స్వామి! నీ వీరగాథలను స్తుతిస్తూ, మా నోముకు కావాల్సిన పరికరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు’ అని గోపికలు వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>