News December 16, 2025

18 నుంచి వినియోగదారుల అవగాహన వారోత్సవాలు

image

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వినియోగదారుల అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. వినియోగదారులకు వారి హక్కులు, వాణిజ్య పద్ధతులపై అవగాహన కల్పించి, ఆత్మవిశ్వాసంతో హక్కులను వినియోగించుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు.

Similar News

News January 8, 2026

ED రైడ్స్.. IPAC ఆఫీసుకు మమత పరుగులు

image

<<18796717>>ED రైడ్స్‌<<>>తో WBలో రాజకీయ వేడి రాజుకుంది. తనిఖీలు జరుగుతున్న కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని IPAC ఆఫీసుకు CM మమత చేరుకున్నారు. బిల్డింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి ఉండడంతో బేస్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో 11వ ఫ్లోర్‌లోని IPAC ఆఫీసులోకి వెళ్లారు. ఆమె, పోలీసులు కలిసి ED రైడ్స్‌ను అడ్డుకున్నారని BJP ఆరోపించింది. దీదీ చర్యలను BJP నాయకులు ఖండిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.

News January 8, 2026

అందోల్: ఆరోగ్యశ్రీ ఉద్యోగి సూసైడ్

image

అందోల్‌ మండలం సంగుపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కమ్మరి రవీందర్(39) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రవీందర్ 12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రవీందర్ మరణంతో భార్య, కుమారుడు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 8, 2026

కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

image

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.