News December 16, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటు’.. ఎల్లో మిర్చి @ రూ.280

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్లో ఎల్లో రకం మిర్చి రికార్డు స్థాయిలో కిలో రూ.200 నుంచి రూ.280 పలికింది. ముఖ్యంగా 2043 ఏసీ రకం గరిష్టంగా రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 వరకు అమ్ముడయ్యాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, 355 రకం రూ.170, బుల్లెట్ రూ.165 పలికాయి. మీడియం సీడు రకాలు రూ.90-110, తాలు రకాలు రూ.60-90 మధ్య ధర పలికాయి.
Similar News
News January 15, 2026
APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.
News January 15, 2026
ఐనవోలు: మీడియా సెంటర్పై నిర్లక్ష్యం..!

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కవరేజ్ కోసం వచ్చే మీడియా ప్రతినిధులకు అధికారులు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. కానీ అందులో కుర్చీలు వేయకపోవడంతో ఇతర శాఖలకు చెందిన కార్లు, ద్విచక్రవాహనాలను అందులో పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులకు చోటు లేకుండా పోయింది. ప్రముఖులు దర్శనానికి వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడాలన్నా ఆలయ ఆవరణే దిక్కయింది.
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.


