News December 16, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ శబరీష్

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న డోర్నకల్, కురవి, సీరోల్, కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలు(5), సీఐలు(15), ఎస్సైలు(50) సుమారు 1000 మంది సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటారని SP పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
నంద్యాల: పాపకు పాలిచ్చి.. హృదయం కన్నీరు పెట్టే ఘటన ఇది

గడివేముల(M) మంచాలకట్ట వద్ద SRBCలో ఆదివారం ఇద్దరు పిల్లలు సహా తల్లి దూకింది. వీరిని ఒండుట్లకు చెందిన ఎల్లా లక్ష్మీ(23), వైష్ణవి(4), సంగీత(5 నెలలు)గా గుర్తించారు. లక్ష్మీ, రమణయ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సంగీత అనారోగ్యం విషయంలో భర్త, అత్తమామలతో గొడవ జరిగినట్లు సమాచారం. గని గ్రామంలో పాపకు వైద్యం చేయించిన లక్ష్మీ బస్ ఎక్కి SRBC వద్ద దిగి సంగీతకు పాలిచ్చింది. అనంతరం కాలువలో దూకినట్లు సమాచారం.
News December 29, 2025
భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్పై పాక్ నిషేధం

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.
News December 29, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే పశుగ్రాసాలివి

పాడి పశువుల పోషణలో, పాల ఉత్పత్తిలో పచ్చి పశుగ్రాసానిది కీలక పాత్ర. అధిక పోషకాలు, మాంసకృత్తులతో కూడిన గడ్డి వల్ల జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దాణాతో పాటు ఎండు, పచ్చి గడ్డిని పశువులకు అందించాలి. పాడి పోషణలో ప్రసిద్ధి చెందిన 4G బుల్లెట్ సూపర్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, జూరీ గడ్డిని ఎలా పెంచాలి? వీటితో లాభమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


