News December 16, 2025
చిత్తూరు: ఫేక్ GST రిజిస్ట్రేషన్.. రూ.కోట్ల లావాదేవీలు.!

చిత్తూరు జిల్లాలో ఫేక్ GST ఘటనలో ఇప్పటి వరకు 80-100 వరకు కేసులు నమోదైనట్లు సమాచారం. ఓ తుక్కు వ్యాపారి ఫేక్ GST ఫర్మ్ రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రూ.50 కోట్ల వరకు ట్యాక్స్ ఎగొట్టినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా నుంచి తుక్కును మహారాష్ట్ర వరకు పంపి కాసుల వర్షం కురిపించుకుంటున్నారట. కొందరైతే ఎలాంటి ఫర్మ్ లేకుండా తుక్కు రవాణా చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 3, 2026
ఈ ఏడాదిలో 835 అగ్ని ప్రమాదాలు.. REPORT

2025కు సంబంధించిన అగ్ని ప్రమాదాల నివేదిక వెలువడింది. ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాలు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 835 అగ్ని ప్రమాదాలు జరగగా రూ.32 కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. GHMC పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News January 3, 2026
మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే ఆద్యురాలు: కలెక్టర్

కుల, లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషి వెలకట్టలేనిదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్, జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.
News January 3, 2026
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34శాతం నీళ్లు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పారు.


