News December 16, 2025
ADB: సోషల్ మీడియాపై నిఘా: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News April 9, 2026
BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో ACB దాడులు

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. బోథ్ ఫారెస్ట్ ఆఫీస్లో దాడులు నిర్వహించగా లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టుపట్టారు. ACB DSP ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాసేపట్లో ఆయన వివరాలు వెల్లడించనున్నారు.
News April 9, 2026
ADB: అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక.. రాంజీ గోండ్

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ADB అడవుల్లో విప్లవ శంఖం పూరించిన వీరయోధుడు రాంజీ గోండ్ వర్ధంతి నేడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆంగ్లేయ సేనలను గడగడలాడించిన ధీశాలి ఆయన. మడమ తిప్పని పోరాటం చేస్తూ చివరికి శత్రువులకు చిక్కి ఉరికొయ్యను ముద్దాడిన ఆయన త్యాగం, నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
News April 8, 2026
రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన ADB షీ టీమ్: SP

మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచి ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో ఆదిలాబాద్ షీ టీమ్ రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 65 ఫిర్యాదులు స్వీకరించి 9 FIRలు, 40 కేసులు నమోదు చేసి 52 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. 39 గ్రామాల సందర్శనతో 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని SP అఖిల్ మహాజన్ వెల్లడించారు.


