News December 17, 2025
తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.
Similar News
News December 31, 2025
కోనసీమ నుంచి తూర్పుగోదావరికి మూడు మండలాలు!

జిల్లాల పునర్విభజన చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ నుంచి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో చేర్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం అధికారికంగా వెల్లడించారు. తాజా మార్పులతో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధి మారనుంది.
News December 31, 2025
అతిపెద్ద జిల్లాగా అవతరించనున్న ‘తూ.గో.’

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. ఈ విలీనంతో తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి భారీ జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.
News December 31, 2025
తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్లోనే 100 కోట్లు హాంఫట్!

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


