News April 21, 2024
NZB: వడ గండ్ల వాన.. వందల ఎకరాల్లో పంట నష్టం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వారం రోజులుగా అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో చోట కురుస్తూనే ఉంది. ధర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్, ఇందల్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.
Similar News
News September 11, 2025
NZB: అడ్మిషన్లకు రెండు రోజులు మాత్రమే

2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపెన్ చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని నిజామాబాద్ DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం ప్రైవేటు కళాశాల్లో నామినల్ రోల్ కరెక్షన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఎలాంటి రుసుం ఉండదన్నారు.
News September 11, 2025
NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నిజామాబాద్ సుభాష్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 11, 2025
నిజామాబాద్లో ఉద్యోగ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్రావు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305743423, 9948748428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.