News December 17, 2025

వరంగల్: పోలింగ్ ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 530 పంచాయతీలకు ఎన్నిక జరుగుతోంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా ఉదయం ఓటర్లు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు.

Similar News

News January 12, 2026

గద్వాల్: నేడు పలు మండలాల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ

image

గ్రామీణ క్రీడాకారులను ప్రపంచస్థాయి విజేతలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. గద్వాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నేడు గద్వాల ఇండోర్ స్టేడియం నుంచి టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కృష్ణయ్య ప్రకటనలో పేర్కొన్నారు. ధరూర్, కేటి దొడ్డి, గట్టు, మల్దకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో టార్చ్ ర్యాలీ ఉంటుందన్నారు.

News January 12, 2026

కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.

News January 12, 2026

కర్నూలు: ఉ.10 నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.