News April 21, 2024

24న మిర్యాలగూడకు కేసీఆర్: భాస్కర్ రావు

image

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ MP అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మిర్యాలగూడ మాజీ MLA నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సిఎం కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. కేసీఆర్ శ్రీకారం చుట్టనున్న రోడ్ షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

Similar News

News September 12, 2025

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్ మృతి చెందాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News September 12, 2025

నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

image

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.

News September 12, 2025

NLG: ఆర్టీసీలో యాత్రాదానం

image

యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, NRIలు, సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.