News December 17, 2025
ములుగు: 11 గంటల వరకు 60.64% పోలింగ్ నమోదు

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 60.64% ఓట్లు పోలయ్యాయి. కన్నాయిగూడెం మండలంలో 64.91%, వెంకటాపురం మండలంలో 60.10%, వాజేడు మండలంలో 59.35% పోలింగ్ నమోదయింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News January 14, 2026
మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News January 14, 2026
నేడు జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

ఉమ్మడి MBNR జిల్లాలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ఎంపీ మల్లు రవితో కలిసి భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మ.3 గంటలకు పెబ్బేరు మండలం తోమాలపల్లిలో వర్చువల్ విధానంలో విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 14, 2026
ముగ్గుల్లో గమ్మతైన గణితం.. ఇలా మెదడు షార్ప్!

పిల్లల్లో గణితం పట్ల ఆసక్తి పెంచడానికి ముగ్గులు గొప్ప సాధనం. చుక్కలు పెట్టడం ద్వారా అంకగణితం, వాటిని కలపడం ద్వారా రేఖాగణితం సులభంగా అర్థమవుతాయి. సరి, బేసి సంఖ్యల అవగాహన పెరుగుతుంది. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ముగ్గులు నేర్పించడం వల్ల వారి మెదడు చురుగ్గా వృద్ధి చెందుతుంది. సంక్లిష్టమైన ముగ్గులు వేయడం మేధస్సుకు సవాలుగా మారుతుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.


