News December 17, 2025

పంచాయతీ పోరు: పాన్‌గల్‌లో జోరు.. వీపనగండ్లలో నెమ్మది

image

వనపర్తి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా పాన్‌గల్‌ మండలంలో 56.7 శాతం పోలింగ్‌ నమోదు కాగా, వీపనగండ్లలో అత్యల్పంగా 52.4 శాతం నమోదైంది. పెబ్బేరు(55.6%), శ్రీరంగాపూర్(54.9%), చిన్నంబావి(54%)ల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు మండలాల్లోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.

Similar News

News January 7, 2026

నిర్మల్: మున్సిపాలిటీలపై బీజేపీ గురి!

image

వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు వెలువుడుతుండడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, BRS, ఎంఐఎం పార్టీల కంటే BJP ఓ అడుగు ముందుకు వేసి కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ పదవులను దక్కించుకొని ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగింది.

News January 7, 2026

డోర్నకల్ ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకరా.. క్యాబినెట్‌లోకా?

image

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.రాంచంద్రు నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు జరిగాయి. డిప్యూటీ స్పీకర్ పై అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయకపోవడంతో గిరిజన ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ను క్యాబినెట్లో తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. CM రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.

News January 7, 2026

ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

image

పొల్యూషన్‌కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్‌లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్