News April 21, 2024
విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్

ఎన్నికల రోజున విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని తూ.గో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలతా తెలియజేశారు. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు 12D ద్వారా పోస్టల్ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.
Similar News
News October 10, 2025
తూ.గో జిల్లాలో ‘నూరు శాతం ఈ క్రాప్ పూర్తి’

తూ.గో జిల్లాలో వరి పంటకు నూరు శాతం ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రాజమండ్రి రూరల్ 16 , కొవ్వూరు 96, నల్లజర్ల 50, నిడదవోలు 20, గోపాలపురం 10, దేవరపల్లి 35, చాగల్లులో 25 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారన్నారు.
News October 10, 2025
గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ సమావేశం

రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ మీటింగ్ గురువారం జరిగింది. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితతో మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. ఈ పుష్కరాలు రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా, కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక ఉత్సవంగా జరుగుతాయన్నారు. అందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News October 9, 2025
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్కు కలెక్టర్ స్వాగతం

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.