News December 17, 2025

ఉండవెల్లి: పోలింగ్ సమయం పూర్తి.. భద్రత కట్టుదిట్టం

image

మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది ఫలితమే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా 68 గ్రామపంచాయతీలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు ఒంటిగంట దాటిన తర్వాత వెంటనే ప్రవేశాలను మూసివేశారు. సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అధికారులు. 144 సెక్షన్ అమల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా.

Similar News

News January 13, 2026

మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్‌ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్‌ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

News January 13, 2026

కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

image

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 13, 2026

నల్గొండ: కరడుగట్టిన దొంగల అరెస్ట్

image

నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ జి.రమేశ్ తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పాత నేరస్థుడు గునిగంటి మహేశ్, HYDకు చెందిన పాత్లావత్ వినయ్ కొంతకాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతేడాది నవంబర్‌లో కేతేపల్లి పరిధిలో ఓ మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని పట్టుకున్నారు.