News December 17, 2025

సిరిసిల్ల: బరిలో బాలింత.. హాస్పిటల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్టునాయక్ తండాకు చెందిన భూక్య వెన్నెల ప్రవీణ్‌కు ఆరు రోజుల కిందట బాబు జన్మించాడు. కాగా, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టునాయక్ తండాలో 8వ వార్డ్ మెంబర్‌గా వెన్నెల బరిలో నిలిచారు. పోలింగ్ కావడంతో దవాఖాన నుంచి నేరుగా తన పసిబిడ్డతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News January 14, 2026

ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

image

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.

News January 14, 2026

GNT: బాహుబలి బ్రిడ్జిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ (అప్డేట్)

image

అమరావతి బాహుబలి బ్రిడ్జిపై పండగ పూట ఘోర ప్రమాదం జరిగిన విషయం <<18856366>>తెలిసిందే. <<>>తుళ్లూరుకి చెందిన మార్క్ (50), రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పౌలు (65) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెంకటపాలెం నుంచి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.

News January 14, 2026

విశాఖ: రైళ్లలో టీ, కాఫీ కోసం Hitech గ్యాడ్జెట్

image

వాల్తేరు రైల్వే డివిజన్ ప్రయాణికులకు శుభవార్త. టీ, కాఫీ విక్రయాల కోసం సరికొత్త ‘హైటెక్ వేరబుల్ గ్యాడ్జెట్’ను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభించారు. ఈ ఇన్సులేటెడ్ పరికరం ద్వారా పానీయాలు ఎక్కువసేపు వేడిగా, పూర్తి పరిశుభ్రంగా లభిస్తాయి. వెండర్స్ మెడలో ధరించే ఈ గ్యాడ్జెట్‌లో డిజిటల్ పేమెంట్, వేస్ట్ కలెక్షన్ సౌకర్యం ఉండటం విశేషం. ఇది ప్రయాణికులకు సురక్షితమైన సేవలను అందిస్తుంది.