News April 21, 2024

BIG ALERT: ఇవాళ వడగండ్ల వానలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు 7 రోజులు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50-60 KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వానలు కురిసే జిల్లాల జాబితాను పైన ఫొటోలో చూడొచ్చు.

Similar News

News October 15, 2024

RAIN EFFECT: ఆ జిల్లాలో 3 రోజులు సెలవులు

image

AP: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

News October 15, 2024

‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్ తీసుకురానున్న ప్రభుత్వం?

image

AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.

News October 15, 2024

కరెంటు వాతలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ: KTR

image

TG: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ KTR విమర్శించారు. ‘కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. 300 యూనిట్లు దాటితే కిలో వాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ ₹50’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?’ అని ప్రశ్నించారు.