News December 17, 2025

చెన్నూరు: మ:1గంట వరకు 87.84%ఓటింగ్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు మండలంలో 3వ విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 87.84% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో మొత్తం 26,102 మంది ఓటర్లు ఉండగా, 22,967 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి వివరించారు.

Similar News

News January 23, 2026

నిర్మల్‌ మున్సిపల్ పీఠం కోసం బీజేపీ ప్లాన్

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం బీజేపీ శక్తివంతంగా ప్రీ-ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో కలిసి టికెట్-ఎంపిక, అభ్యర్థుల సామర్థ్యం, ఓటర్ల భావోద్వేగాన్ని అంచనా వేసే సమీక్షలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల ప్రకారం బీజేపీ ముఖ్యంగా కొన్ని కీలక వార్డుల్లో గట్టి ప్రచారానికి సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండా ప్రకటించనుందని భావిస్తున్నారు.

News January 23, 2026

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

image

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే భక్తులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది. ఈనెల 28, 30, FEB 1 తేదీల్లో 07495/96 నంబర్ ట్రైన్ సికింద్రాబాద్-మంచిర్యాల, ఈనెల 29, 31 తేదీల్లో 07497/98 రైలు సిక్రిందాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడుస్తాయి. WGL, కాజీపేట, ఉప్పల్, JMKT, బిజిగిరిషరిఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, PDPL, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట తదితర స్టేషన్లో ఈ రైళ్లు ఆగుతాయి.

News January 23, 2026

వరంగల్: వసంత పంచమి.. భద్రకాళి దివ్యదర్శనం

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో వసంత పంచమి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతులు ఇచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.