News December 17, 2025
విజయవాడ: ఆర్టీసీ అధికారుల మొద్దు నిద్ర.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా!

విజయవాడ బస్టాండ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో మహిళ <<18595385>>రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి<<>>. గతంలోనూ జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. కాగా బస్టాండ్లో RTC డ్రైవర్లు అధిక వేగంతో బస్సులు నడుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. బస్టాండ్లో ఎలాంటి వ్యాపారాలు పెట్టి డబ్బులు సంపాదించాలి, ఏ షాపుని ఎన్ని లక్షలకు అద్దెకి ఇస్తే ఆదాయం వస్తుందన్న ఆలోచన తప్ప, ప్రయాణికుల భద్రతను పట్టించుకోవటం లేదన్నది స్పష్టమవుతోంది.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


