News December 17, 2025
ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు: ఎస్పీ నరసింహ

జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నరసింహ వెల్లడించారు. 1,500 మంది పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎన్నికలను విజయవంతం చేశారని కొనియాడారు. తనిఖీల్లో భాగంగా రూ.10.53 లక్షల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నామని, 1,488 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 13, 2026
కడప: భర్త SP.. భార్య JC

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.
News January 13, 2026
భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.
News January 13, 2026
మామిడి ఆకులపై బుడిపెల నివారణ ఎలా?

కొన్ని తోటల్లో మామిడి చెట్ల ఆకులపై బుడిపెలు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆకులు ఎండి, రాలిపోతుంటాయి. మీడ్జ్ పురుగు ఆశించడం వల్ల ఆకులపై ఈ బొడిపెలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్ (3000 పి.పి.ఎం) 300ml + క్లోరిపైరిఫాస్ 250mlను కలిపి చెట్ల ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ మందును పిచికారీ చేయడం మంచిది.


