News December 18, 2025
VZM: కలెక్టర్ల సమావేశంలో మన కలెక్టర్ కీలక ప్రతిపాదన

ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో బుధవారం ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పశుగ్రాస కేంద్రాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. 2016 నుంచి 2019 మధ్య ఈ పథకం అమలులో ఉన్నట్లు గుర్తు చేశారు.
Similar News
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్సోర్సింగ్లో 1095 పోస్టులకు <
News January 3, 2026
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 2024 డిసెంబర్లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.


