News December 18, 2025
రైతుల ఖాతాల్లోకి రూ.53 కోట్లు: సివిల్ సప్లైస్ మేనేజర్

ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 3,520 మంది రైతుల వద్ద నుంచి 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తులసి తెలిపారు. తెనాలిలో వ్యాగన్ల ద్వారా జరుగుతున్న ధాన్యం ఎగుమతులను బుధవారం సాయంత్రం పరిశీలించారు. రూ.53 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. నేడు, రేపు 2,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాగన్లలో కాకినాడ జిల్లా పెద్దాపురం మిల్లుకు తరలిస్తున్నట్టు తెలిపారు.
Similar News
News January 3, 2026
GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 3, 2026
GNT: ప్రముఖులకు స్వాగతం పలికిన అధికారులు

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు వారు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులకు స్వాగతం పలికారు.
News January 3, 2026
GNT: పోలీసులకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది వారి బదిలీలు, సర్వీస్, వ్యక్తిగత సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందించారు. పోలీస్ శాఖ కుటుంబం లాంటిదని, క్రమశిక్షణ, సమయభావం పాటిస్తూ పరస్పరం అర్థం చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.


