News April 21, 2024
పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి 8 నామినేషన్లు

నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులు రెండు మూడు సెట్లతో పాటు డమ్మీలు వేస్తుంటారు. ఇలా తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 8 నామినేషన్లు పడ్డాయి. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2, ఆయన భార్య 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లెలో 2 సెట్లు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కుమారుడు మిథున్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ వేశారు.
Similar News
News March 10, 2026
గుడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
చిత్తూరు: KGBVల్లో ప్రవేశానికి దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలోని 7 KGBV బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 40 సీట్లు, 7 నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటరమణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. ఏప్రిల్ 13-17 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు KGBVలోని ప్రిన్సిపల్స్ను సంప్రదించాలన్నారు.
News March 10, 2026
చల్లా బాబును దూరం పెడుతున్న అధినేత..?

చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా, త్రిసభ్య కమిటీ వేసి, పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. సరైన నేత ఉంటే 2029 ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట.


