News April 21, 2024
పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి 8 నామినేషన్లు

నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులు రెండు మూడు సెట్లతో పాటు డమ్మీలు వేస్తుంటారు. ఇలా తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 8 నామినేషన్లు పడ్డాయి. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2, ఆయన భార్య 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లెలో 2 సెట్లు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కుమారుడు మిథున్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ వేశారు.
Similar News
News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
News October 10, 2025
చిత్తూరు: టీచర్ల శిక్షణను పరిశీలించిన కలెక్టర్

మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు చిత్తూరులోని ఓ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. నూతనంగా ఎంపికైన టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేసి భావి భారత పౌరులను తయారు చేసేలా కృషి చేయాలని సూచించారు. విధుల్లో చేరిన నాటి నుంచి చివరి దశ వరకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీడీ వెంకటరమణ, ఇందిరా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
News October 9, 2025
పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

పాలీహౌస్ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో ఉద్యానవన శాఖ సీడ్ ఏపీ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం రైతులతో సమావేశం అయి వారికి పలు సూచనలు ఇచ్చారు.