News April 21, 2024

దుబాయ్‌లో గుండెపోటుతో సోన్ వాసి మృతి

image

సోన్ మండలం గంజాల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పాలెపు గంగయ్య (43) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ నెల 12న గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Similar News

News July 10, 2025

రుయ్యాడి పీర్ల బంగ్లా ఆదాయం ఎంతంటే..?

image

తలమడుగు మండలం రుయ్యాడి హస్సేన్, హుస్సేన్ దేవస్థానంలో సవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ లెక్కింపును బుధవారం చేపట్టారు. దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగింది. నగదు రూపంలో రూ.14 లక్షలు,10 తులాల బంగారం, 1.25 కేజీల వెండి వచ్చినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.

News July 10, 2025

ADB: నకిలీ పత్రాలతో భూ మాఫియా.. ముఠా అరెస్టు

image

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ల అమ్మకం పేరుతో రూ.23 లక్షలు మోసం చేసిన ఘటనలో ఆరుగురిపై ADB రూరల్ PSలో కేసు నమోదైంది. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్‌రెడ్డి తెలిపారు. గుగులోత్ బాపురావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), అతడి భార్య అంబికా, దాసరి జ్యోతి, గొడ్డెంల శ్రీనివాస్, పాలెపు శ్రీనివాస్, మాల్లేపల్లి భూమన్నతో కలిసి, నకిలీ పత్రాలు సృష్టించి భూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

News July 10, 2025

ADB: నేడే సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2023 జూన్ 16న పరీక్ష రాసిన మహిళా అభ్యర్థుల 1:3 నిష్పత్తి మెరిట్ జాబితాను https://deoadbd.weebly.com వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం డీఈఓ కార్యాలయంలో మధ్యాహ్న 3 గంటలకు హాజరుకావాలని సూచించారు.