News December 18, 2025

సిద్దిపేట: ఒక్క ఓటుతో గెలుపు.. రికౌంటింగ్‌

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు కర్రోళ్ల నాగరాజు, కొయ్యడ వెంకటేశం మధ్య ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశం సమీప ప్రత్యర్థి పై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 11, 2026

పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

image

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.

News January 11, 2026

మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 11, 2026

ఇక కేరళ వంతు.. BJP పవర్‌లోకి వస్తుంది: అమిత్ షా

image

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో BJP అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘2014లో 11% ఓట్లు వస్తే 2024లో 20%కి పెరిగాయి. త్వరలో 40% సాధిస్తాం. కేరళ వంతు వచ్చింది. ఇక్కడ కచ్చితంగా బీజేపీ సీఎం ఎన్నికవుతారు’ అని చెప్పారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ-ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.