News December 18, 2025

ఖమ్మం కలెక్టర్‌కు ‘బిట్స్‌ పిలానీ’ ప్రతిష్ఠాత్మక పురస్కారం

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ ప్రకటించిన ‘యంగ్ అల్యూమ్నీ అచీవర్స్ అవార్డ్స్-2026’కు ఆయన ఎంపికయ్యారు. 2007బ్యాచ్‌కు చెందిన అనుదీప్, సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో పాటు, IASగా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో కలెక్టర్‌‌కు జిల్లా ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 29, 2025

ఖమ్మం: ’34 ఏళ్ల తరువాత కలుసుకున్నారు’

image

కామేపల్లి మండలం కొమ్మినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. దశాబ్దాల తర్వాత ఒకేచోట చేరిన మిత్రులంతా అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు కష్టసుఖాలు పంచుకుంటూ, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు.

News December 28, 2025

సత్తుపల్లి – ఖమ్మం ప్రయాణం ఇక 34 నిమిషాలే: తుమ్మల

image

గ్రీన్‌ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.

News December 28, 2025

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్‌ ఏవో

image

కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్‌ ఏవో కిషోర్‌ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.