News December 18, 2025
వరంగల్: ఆ ఇద్దరు మళ్లొచ్చారోచ్!

ఒకాయన చేసిన తుపాకీ సెటిల్మెంట్కి ఆమె మంత్రి పదవికే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. మరొక అతను ఇసుక లారీల కోసం చేసిన కాల్స్తో మరో మంత్రికి మచ్చ తెచ్చింది. మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ ఇద్దరు చేసిన గండాల నుంచి, మంత్రులు ఇలా బయటపడ్డారో లేదో మళ్లీ వచ్చి వాలిపోయారు. మంత్రుల దగ్గర తమ తడాఖా చూపెడుతున్నారు. అయితే, పోయిందనుకున్న గండం మళ్లీ రావడంతో ఉమ్మడి వరంగల్ నేతలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News January 15, 2026
NTR: 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్..!

గాయత్రి నగర్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న ఓ మహిళ మెడలో నుంచి రూ. 9 లక్షల విలువైన బంగారు గొలుసును తెంచుకుపోయిన పటమటకు చెందిన మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
News January 15, 2026
శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.
News January 15, 2026
యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్షిప్లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.


