News April 21, 2024

IPL: సగం మ్యాచులు ముగిశాయి.. అగ్రస్థానం ఎవరిదంటే?

image

ఐపీఎల్ 2024లో లీగ్ దశలో సగం మ్యాచులు ముగిశాయి. పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లతో ఆర్సీబీ అట్టడుగున ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ(361), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా(13) ఉన్నారు. ఇప్పటికే పలు సంచలనాలు నమోదు కాగా.. మున్ముందు ఇంకెన్ని నమోదవుతాయో వేచి చూడాలి.

Similar News

News October 15, 2024

హైదరాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్‌రామ్‌గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News October 15, 2024

మార్కెటింగ్ కంటెంట్లో AIతో జాగ్రత్త.. లేదంటే!

image

AI‌తో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్‌పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

News October 15, 2024

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం

image

AP: వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫుడ్‌ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది.