News December 18, 2025

ఏలూరు: కన్న కొడుకే గెంటేశాడు..!

image

కన్నకొడుకే తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన ముదినేపల్లి (M) కొత్తపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు కోటేశ్వరమ్మ వివరాల మేరకు.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకోగా చిన్న కొడుకు దానికి లాక్కున్నాడు. కొంత కాలం ఇంట్లో ఉంటామని చెప్పి కుమారుడు, కోడలు ఇంటిని స్వాధీనం చేసుకుని తనను బయటకు పంపేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని బుధవారం ఏలూరులో RDO అచ్యుత అంబరీష్‌ను కోరింది.

Similar News

News January 13, 2026

కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

image

జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

News January 13, 2026

‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

image

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.

News January 13, 2026

కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.