News December 18, 2025
చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 29, 2025
మంత్రి రాంప్రసాద్రెడ్డికి చంద్రబాబు ఫోన్

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.
News December 29, 2025
T20Iల్లో సంచలనం.. 4 ఓవర్లలో 8 వికెట్లు

T20Iలో భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే రికార్డు సృష్టించారు. మయన్మార్తో జరిగిన మూడో T20Iలో 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్లో ఒకే మ్యాచ్లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచారు. ఈ మ్యాచ్లో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ నుంచి దీపక్ చాహర్ 2019లో ఒక T20 మ్యాచ్లో 6 వికెట్లు తీశారు.
News December 29, 2025
టమాటా కాయలపై చిన్న చిన్న రంధ్రాలకు కారణమేంటి?

కొన్ని టమాటా కాయలను పరిశీలిస్తే వాటిపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. దీనికి కారణం సూది పురుగు. ఇది చిన్న గొంగళి పురుగు రూపంలో ఉండి, ఆకులలో సొరంగాలను చేసి, పండ్లలో చిన్న రంధ్రాలు చేసి లోపల తింటుంది. ఈ పురుగుల వల్ల పండ్లు రంగు మారి, పాడైపోతాయి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml లేదా ప్లూబెండమైడ్ 0.2ml కలిపి పిచికారీ చేయాలి.


