News December 18, 2025
HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.
Similar News
News January 14, 2026
‘భూ భారతి’ స్కామ్లో అధికారుల పాత్ర!

TG: భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. RR, యాదాద్రి జిల్లాల్లోనే భారీగా అవినీతి జరగగా అక్రమార్కులతో తహశీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలున్నాయి. రూ.కోట్ల విలువైన భూములకు రూ.లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా 40-50 రూపాయలే చలాన్ కట్టి మిగతా సొమ్మును కాజేశారు. కాగా ఈ భాగోతం బయటపడటంతో ప్రభుత్వం పోర్టల్లో ఇంటర్ఫేజ్ వ్యవస్థను బలోపేతం చేసింది.
News January 14, 2026
భూపాలపల్లి: విద్యుత్ తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయొద్దు!

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయవద్దని భూపాలపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చైనా మాంజా వాడకం ప్రమాదకరమని, కాటన్ దారం మాత్రమే వాడాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ తీగలు లేని ఖాళీ ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగిరేలా చూడాలన్నారు. ప్రజలందరూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
News January 14, 2026
తల్లి బాటలోనే కుమారుల పయనం

2011లో కేవలం 10, 12 పశువులతో మణిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులు ఆమె డెయిరీలో ఉన్నాయి. మణిబెన్ ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతూ తల్లికి తోడుగా నిలుస్తున్నారు.


