News December 18, 2025
పార్డి (బి)లో రికార్డు.. సర్పంచ్గా 22 ఏళ్ల యువకుడు

కుబీర్ మండలం పార్డి-బి చరిత్రలోనే పిన్న వయస్కుడైన ప్రవీణ్ సర్పంచ్గా రికార్డు సృష్టించారు. పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి జరిగిన 15 ఎన్నికల్లో మొదటిసారిగా 22ఏళ్ల ప్రవీణ్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారే సర్పంచులుగా ఎన్నికవ్వగా తొలిసారి చిన్నవయస్సులో సర్పంచ్ అయి రికార్డు నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రాజేశ్వర్పై 371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Similar News
News January 17, 2026
REWIND: 1947-77 నాగోబా జాతర దృశ్యం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. ఆదివారం(రేపు) మహాపూజ జరగనుంది.
News January 17, 2026
చిత్తూరు: సచివాలయాలకు నూతన నిబంధనలు

సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో సేవలు అందించాలని ఆదేశించింది. ఆ మేరకు ఉదయం, సాయంత్రం సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి. సమయపాలన పాటించకపోతే విధులకు హాజరుకానున్నట్లు గుర్తించనున్నారు. లీవ్ పెట్టేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించింది.
News January 17, 2026
ఖమ్మం, భద్రాద్రిలో మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇవే.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ – ఎస్టీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ – జనరల్ మహిళ, అశ్వారావుపేట మున్సిపాలిటీ – జనరల్ మహిళ, ఇల్లందు – బీసీ మహిళ, కల్లూరు – ఎస్టీ జనరల్, మధిర – జనరల్ మహిళ, వైరా – జనరల్ మహిళ, సత్తుపల్లి – జనరల్ మహిళ, ఏదులాపురం – ఎస్సీ మహిళకు కేటాయించారు.


