News December 18, 2025
మఠంపల్లి: సుతారి మేస్త్రీ నుంచి సర్పంచిగా..

మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఓ సామాన్యుడు సర్పంచిగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. మఠంపల్లి మం. పెదవీడు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అమరవరపు వెంకటేశ్వర్లు 250ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన మళ్లీ బరిలో నిలిచారు. గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్మికుడు సర్పంచిగా ఎన్నికవ్వడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.
Similar News
News January 13, 2026
20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
News January 13, 2026
ఇరాన్లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
News January 13, 2026
విద్యుత్ చార్జీలపై అభిప్రాయ సేకరణ.. ఎప్పుడంటే?

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్పై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఎస్ఈ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్ఈ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


