News December 18, 2025

వనపర్తి: ‘ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి’

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,80,294 రేషన్ కార్డుల్లోని 6,09,645 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 4,23,466 మంది లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగతా 1,86,179 లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న రేషన్ షాపుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

Similar News

News December 27, 2025

కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటి గడ్డగా నల్లగొండ జిల్లా

image

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం సీపీఐ జిల్లాలో దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి, గిట్టుబాటు ధరలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన పార్టీ నిర్మాణంతో ప్రజల మధ్య పని చేస్తూ సమ సమాజ సాధనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోంది.

News December 27, 2025

బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం: కలెక్టర్

image

గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నుంచి బాపట్ల జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

News December 27, 2025

గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.