News December 18, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
పుష్ప స్టైల్లో స్మగ్లింగ్.. డీజిల్ ట్యాంక్లో ₹25 లక్షల డ్రగ్స్

ఇండోర్ (MP)లో Pushpa సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా ₹25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్స్టేట్ డ్రగ్ నెట్వర్క్ వెనక ఉన్న గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.
News January 8, 2026
ప్రభుత్వ ప్రకటనల్లో నాయకుల ఫొటోలు.. జోక్యానికి హైకోర్టు నిరాకరణ

AP: ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకే వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి కొండలరావు ఈ పిల్ను దాఖలు చేశారు.
News January 8, 2026
మిరప పంటకు తెగుళ్ల ముప్పు.. నివారణ ఎలా?

చలి తీవ్రత కారణంగా మిరప పంటలో తెగుళ్ల ముప్పు పెరిగింది. ముఖ్యంగా నల్లతామర పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా మొక్కల ఆకులు, కాయలు రాలి, పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతున్నాయి. నల్ల తామర పురుగులతో పాటు బూడిద తెగులు, పూత, కాయతొలుచు పురుగుల ఉద్ధృతి కూడా పెరిగింది. వీటి నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


