News December 18, 2025
రేగొండ: డబుల్ మర్డర్ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డి(45)ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధించింది. ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.
News January 14, 2026
మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.
News January 14, 2026
చందుర్తి: GREAT.. జాతీయ స్థాయికి ఎంపిక: కలెక్టర్ ప్రశంస

సైన్స్ ప్రాజెక్ట్ను రూపొందించి జాతీయ స్థాయికి ఎంపికైన మల్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జాహ్నవిని కలెక్టర్ గరీమా అగర్వాల్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కలెక్టర్ అభినందించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


