News December 18, 2025
అల్లూరి: 800 ఎకరాలలో పట్టుపురుగుల సాగు

పాడేరులోని అల్లూరి జిల్లా పట్టు పరిశ్రమ ప్రధాన కార్యాలయంలో స్కిల్ సమగ్ర-2 పథకంపై గురువారం పట్టు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ JC తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పట్టు ఉత్పత్తిలో రైతులకు అవగాహన కల్పిస్తూ, 400మంది రైతులతో, 800ఎకరాలలో పట్టుపురుగుల సాగు చేస్తున్నామన్నారు. సంవత్సరంలో పది పంటలు తీసుకొని ప్రతి నెలా ఆదాయం పొందేలా చూస్తున్నామన్నారు.
Similar News
News January 12, 2026
NGKL: సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంపీ

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ డా. మల్లు రవి అధికారులకు సూచించారు. గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 251 ఫిర్యాదులకు గానూ 176 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయని కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం బాధితులకు తక్షణ పరిహారం అందజేయాలని ఎంపీ ఆదేశించారు.
News January 12, 2026
ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.
News January 12, 2026
కనీసం 7 గంటలు నిద్రపోవట్లేదా.. మీ ఆయుష్షు తగ్గినట్లే!

నిద్ర సరిగా లేకపోతే సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఏకంగా ఆయుష్షే తగ్గిపోతుందని Oregon Health Science University స్టడీలో తేలింది. ఆయుర్దాయంపై ప్రభావం చూపే జీవనశైలి అలవాట్లను పరిశీలించగా.. స్మోకింగ్ తర్వాత నిద్రే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారి ఆయుష్షు తగ్గుతున్నట్లు గమనించారు. డైట్, వ్యాయామం కంటే కూడా నిద్రే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు.


