News December 18, 2025
విశాఖ: సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
Similar News
News December 28, 2025
ఆక్రమణల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

విశాఖ జిల్లాలో భూ ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, జనవరి నాటికి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ..జీవో నం.27, 30,45, 296లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెట్రో రైల్ భూసేకరణలో జాప్యం జరగకూడదని, భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
News December 28, 2025
ఆక్రమణల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

విశాఖ జిల్లాలో భూ ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, జనవరి నాటికి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ..జీవో నం.27, 30,45, 296లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెట్రో రైల్ భూసేకరణలో జాప్యం జరగకూడదని, భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
News December 28, 2025
విశాఖలో వార్షిక నేర సమీక్షా సమావేశం

విశాఖ నగరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ‘వార్షిక నేర సమీక్ష–2025’ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పాల్గొని సమర్థవంతమైన పోలీసింగ్కు పలు సూచనలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ అంశాలపై సీపీ సమీక్షించి, వచ్చే ఏడాదికి దిశానిర్దేశం చేశారు.


