News December 18, 2025
కాకినాడ: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.

కారుణ్య నియామకం, కుటుంబ పింఛను మంజూరు కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మరో ఇద్దరు సిబ్బంది ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం గురువారం వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను జుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
Similar News
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.
News January 12, 2026
గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

గోవా షిప్యార్డ్ లిమిటెడ్(<
News January 12, 2026
తండ్రి బతికుండగా కొడుకు చేయకూడని పనులు

పితృకార్యాలు, తర్పణాలు, పిండప్రదానం వంటి కార్యక్రమాలను చేయకూడదు. దానధర్మాలు చేసేటప్పుడు తండ్రి పేరు మీదుగా చేయడం ఉత్తమం. తండ్రి బతికి ఉండగా మీసాలు పూర్తిగా తొలగించడం, శుభకార్యాల ఆహ్వాన పత్రికల్లో తండ్రి పేరును కాదని కొడుకు పేరును ముందుగా వేయడం సంప్రదాయ విరుద్ధంగా పరిగణిస్తారు. తండ్రిని కుటుంబ యజమానిగా గౌరవిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవడం వల్ల కుటుంబంలో సామరస్యం నెలకొంటుందని మన పెద్దలు చెబుతారు.


