News December 18, 2025
MNCL: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.
Similar News
News January 14, 2026
అచ్చంపేట కుటుంబం ఆదర్శం

ఉద్యోగ రీత్యా దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సంక్రాంతికి మాత్రం స్వగ్రామం చేరడం ఆ కుటుంబానికి 12 ఏళ్లుగా ఆనవాయితీ. అచ్చంపేటకు చెందిన సదరు కుటుంబ సభ్యులు బుధవారం ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వేడుకలు చేసుకున్నారు. చిన్నలు, పెద్దలు అంతా కలిసి వేడుకల్లో పాల్గొంటూ అనురాగాలను పంచుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ వేళ ఇలా అందరూ కలవడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 14, 2026
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ సర్వీసులు నడపాలి: MLA

AP: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైనా విశాఖ నుంచి కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసులకైనా అవకాశమివ్వాలని MLA విష్ణుకుమార్ రాజు కోరారు. ‘VSP నుంచి ఏటా 30L మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భోగాపురం చేరాలంటే 2 గంటల సమయం, ట్యాక్సీలకు ₹4500 వరకు ఖర్చు అవుతుంది. విజయవాడకు వందేభారత్ ట్రైన్లో 4 గంటల్లో చేరుకోవచ్చు. అదే భోగాపురం నుంచి విమానంలో వెళ్లాలంటే 6గంటలు పడుతుంది. ఖర్చూ ఎక్కువే’ అని పేర్కొన్నారు.
News January 14, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్చెరు, లింగపల్లి, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.


